Breaking News

30 శాతం రాయితీ తో వినియోగదారులకు అందుబాటులో ఆప్కో వస్త్రాలు

-ఆప్కో డియంవో బి. శివప్రసాద్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆప్కో వస్త్రాలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆప్కో వస్త్రాల అమ్మకాల పై 30 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆప్కో డియంవో బి.శివప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మంగళగిరి, బందరు, రాజమండ్రి, చీరాల, కాటన్‌ చీరలు, ఉప్పాడ వెంకటగిరి, మాధవరం పట్టు చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, దుప్పట్లు, టవల్స్‌, లుంగీలు వంటి చేనేత వస్త్రాలు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆప్కో షో రూమ్‌ ద్వారా అన్ని రకాల వస్త్రాల అమ్మకాలపై 30 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఏలూరు రోడ్డు రామమందిరం, సెలబ్రేషన్స్‌`పోలీ క్లినిక్‌ రోడ్‌, అమరావతి – ఏలూరు రోడ్‌, బాపు మ్యూజియం, ఎయిర్‌పోర్ట్‌, ఏపి సెక్రటేరియట్‌ షోరూమ్‌లలో గల ఆప్కో మెగా షో రూమ్‌లో 30 శాతం రాయితీ పై అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షషష.aజూషశీష్ట్రaఅసశ్రీశీశీఎం.షశీఎ అన్‌లైన్‌ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మిత్రా, పేటెమ్‌ వంటి అన్‌లైన్‌ స్టోర్స్‌ నుండి కూడా ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేయవచ్చునని ఈ అవకాశాన్ని చేనేత వస్త్ర అభిమానులు వినియోగించుకొని చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు నేత పరిశ్రమలకు చేయూతనివ్వాలని ఆప్కో డియంవో బి. శివప్రసాద్‌ ఆ ప్రకటనలో కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *