విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ తరుణ్ కాకాని, ప్రముఖ బీజేపీ ఏపీ నాయకులు,సీఈఓ, ఏబీసీ-అమరావతి బోటింగ్ క్లబ్, ఏపీ స్టేట్ రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, ఖేలో ఇండియా సభ్యుడు-దక్షిణ భారతదేశం, బాల భారతి సంస్కృత శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ ద్వారా సత్కరించారు. సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అనుబంధ సంస్థ, సంస్కృతభారతి, న్యూఢిల్లీ . కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎస్వీ రామారావు, ఈవో, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల మరియు తిరుపతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మూర్తి జీతో పాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ మరియు ఇతర విహెచ్పి పెద్దలు పాల్గొన్నారు. తన వంతుగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందజేశారు కాకాని. అంతకుముందు సిద్ధార్థ కళాశాలలో జరిగిన ఆర్ ఎస్ ఎస్ వారి గురుపూజోత్సవ కార్యక్రమంలో సైతం పాల్గొని వితరణ అందచేశారు. హిందూ ధర్మం కోసం కృషి చేస్తున్న వారికి మరియు అనుబంధ సంస్థలకు కాకాని తరుణ్ అండగా ఉండటం అభినందనీయం అని పలువురు కొనియాడారు. ఏబీవీపీ స్టూడెంట్ ర్యాలీ లో సైతం పాల్గొని బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు కాకాని. ఉక్కు కాకాని పేరు నిలబెట్టటం సంతోషంగా ఉందని జిల్లా వాసులు కొనియాడారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …