Breaking News

కేంద్ర ఐఐటి పెండింగ్ పనుల పరిష్కార దిశగా చర్యలు : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

ఏర్పేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటి ని జెసి ధ్యానచంద్ర తో కలిసి సందర్శించి పెండింగ్ పనుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఏర్పేడు వద్ద గల కేంద్ర విద్యాసంస్థ ఐఐటి ని కలెక్టర్ గారు జెసి తో కలిసి సందర్శించగా ప్రొఫెసర్ డా. కే.ఎన్. సత్యనారాయణ క్యాంపస్ పురోగతిపై వివరించారు. కలెక్టర్ పలు వివరాలు తెలుసుకుని, పెండింగ్ అంశాలను భూ సంబంధిత మరియు ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ కు తెలిపారు. ఈ సమావేశంలో ఐఐటి డిప్యూటీ రిజిస్ట్రార్ చమన్ మెహతా, తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *