మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మార్కాపురం టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శించారు. శనివారం నాడు మంత్రి మార్కాపురంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని, త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేను పరామర్శించిన వారిలో మంత్రితోపాటు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి,యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్, బాబు తదితరులు ఉన్నారు.
Tags amaravathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …