రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పలు అంశాలపై రేణిగుంట విమానాశ్రయం నందు జెసి ధ్యాన చంద్ర తో కలిసి సమీక్షించి పలు అంశాలపై అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పలు సూచనలు చేశారు. శనివారం కలెక్టర్ రేణిగుంట విమానాశ్రయం నందు ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పెండింగ్ భూ సంబంధిత అంశాలపై, ఎలక్ట్రిక్ లైన్ తదితర పెండింగ్ అంశాలపై కలెక్టర్ జెసి తో కలిసి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, ట్రాన్స్కో తదితర అధికారులతో సమీక్షించి అధికారులకు పరిష్కార దిశగా పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ట్రాన్స్ కో అధికారులు, కేఈఐ సంస్థ ప్రతినిధులు, జి సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్, ఎయిర్పోర్ట్ సివిల్, ఆపరేషనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …