Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు

-రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 
-పశు పోషకులకు 90% రాయితీపై షెడ్ల నిర్మాణం.
-గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకు 70% రాయితీ..
-గరిష్ఠంగా యూనిట్ కు 2.3 లక్షలు
-అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి NDA ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ నిర్వహణలో గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల పెంపకందారులను మరింత ప్రోత్సహించడానికి పశువులు/గొర్రెలు/మేకలు/కోళ్ల షెల్టర్ల నిర్మాణంపై రాయితీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పశు పోషకులకు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్లకు 90% రాయితీపై
గరిష్ఠంగా యూనిట్ 2,30,000 వరకు..

గొర్రెలు, మేకల షెడ్లకు 70% రాయితీపై గరిష్ఠంగా యూనిట్ 2,30,000 వరకు..

కోళ్ల పెంపకం షెడ్లకు 70%రాయితీపై గరిష్ఠంగా యూనిట్ 1,32,000 వరకు రాయితీ లభిస్తుంది.

త్వరలో అన్ని జిల్లాల్లో పథకం అమలు జరుతుందని వెల్లడించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *