ఇంద్రకీలాద్రి,, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే (గత 15 సంవత్సరాలుగా) ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య మరియు కమిటీ సభ్యులు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోనం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు స్వాగతం పలికారు.
అనంతరం బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద వీరు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు మరియు తెలంగాణా బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమును ప్రారంభించారు. అనంతరం తెలంగాణా బోనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు జమ్మిదొడ్డి నుంచి పోతురాజుల విన్యాసాలు, వివిధ కళాకారుల వేషధారణలు, నృత్యాలు, కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలుతో సుమారు 1000 మంది పైగా ఊరేగింపుగా బయలుదేరి రధం సెంటరు, ఘాట్ రోడ్డు మీదుగా శ్రీ అమ్మవారికి సమర్పించు బంగారు భోనం తలపై ఉంచుకుని దుర్గా ఘాట్ వద్ద కృష్ణ నది గంగ తెప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ అమ్మవారి ఆలయమునకు కాలినడకన చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించి అమ్మవారికి బంగారు భోనం సమర్పించారు.
అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వాహణాధికారి వీరికి అమ్మవారి శేషవస్త్రములు, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమంలో భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు, ఆలయ వైదిక సిబ్బంది, సహాయ కార్యనిర్వహణాధికారులు పర్యవేక్షకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …