విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుండి జక్కంపూడి వెళ్ళు నీటి సరఫరా పైప్ లైన్లు మరమ్మతులు ఉండటం వలన జక్కంపూడి వాసులకు రెండు రోజుల వరకు మంచినీటి సరఫరా ఉండదని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంచినీటి ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. పైప్లైన్లు మరమతులు జరిగేంతవరకు ప్రజలు సహకరించవలసిందిగా కోరారు.