Breaking News

నగరంలో ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం

-అంతర్గత రహదారులు, కల్వర్ట్స్, స్ట్రీట్ లైట్ పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
-ప్రజారోగ్య లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, మురుగనీరుపారుదల, మెరుగైన శానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలి
-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలు మురుగు నీటి వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైలను యుద్ధ ప్రాతిపదికిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు

సోమవారం నగరంలోని 37వ డివిజన్ లో స్థానిక నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 37వ వార్డు 36 వ వార్డును అనుసంధానం చేస్తూ మేజర్ డ్రైయిన్ గత ప్రభుత్వంలో నిర్మాణం పనులు చేపట్టగా 2018 సంవత్సరం నుంచి ఆ పనులు ముందుకు సాగటం లేదన్నారు. ఈ పనులకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు సమీక్ష చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి నెలరోజులు లోపు ఈ మేజర్ డ్రైన్ పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తయితే లలితా నగర్, ఆదమ్మ దిబ్బ ప్రాంత ప్రజలకు మురుగునీరు సమస్య కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా వేగవంతంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా డ్రైన్ డీసెల్ టేషన్ సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో శానిటేషన్ మురుగునీటి పారుదలయ్యేలా నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలని శాసనసభ్యులు అధికారులకు సూచించారు. ఈ సందర్భముగా శాసనసభ్యులు క్షేత్రస్థాయి పర్యటనలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు అంతర్గత రహదారులు, శానిటేషన్, కల్వర్ట్స్, స్ట్రీట్ లైట్ వంటి అంశాలకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులు సూచించారు. ప్రజారోగ్య సంరక్షణ లక్ష్యంగా నగరపాలక సంస్థ వైద్యాధికారులు ఆరోగ్య ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి మందులు అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యు, లోకేష్, ఆశ వర్కర్స్. సచివాలయం, సచివాలయం సెక్రటరీస్, ఏ. ఈ, డి. ఈ. ఆర్. పి, రిసోర్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *