గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజల రాకపోకలకు ఆటంకం లేకుండా ప్రధాన రహదార్లకు ప్యాచ్ వర్క్ లు తక్షణం చేపట్టాలని, ప్రజా ప్రతినిధుల క్షేత్ర స్థాయి పర్యటనల్లో సంబందిత అధికారులు కూడా పాల్గొని, పర్యటనలో గుర్తించిన సమస్యల పరిష్కారనికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవితో కలిసి, నియోజకవర్గంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న ప్రాంతాల్లో తక్షణం తాత్కాలికంగా ప్యాచ్ వర్క్ లు చేపట్టాలని, వర్షాకాలం అనంతరం శాశ్వత పరిష్కారంగా రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు టెండర్ పొందిన కాంట్రాక్టర్లు నిర్దేశిత గడువులో పనులు ప్రారంభించడం చేయాలని, లేకుంటే వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఈలకు స్పష్టం చేశారు. పీకలవాగు పై దెబ్బతిన్న కల్వర్ట్ ల నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఇప్పటికే ఎక్కడైనా డ్యామేజి జరిగి, ప్రజల రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్న వాటి వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పాత యుజిడి సెప్టిక్ ట్యాంక్ స్థానంలో నూతన ట్యాంక్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధుల క్షేత్ర స్థాయి పర్యటనలలో స్థానిక అధికారులు పాల్గొనాలని, ప్రజా ప్రతినిధుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి టైం లైన్ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ వర్షాకాలం స్థానిక కాలనీల్లో వర్షం నీరు నిలిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంజినీరింగ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనల్లో ప్రజల స్థానిక సమస్యలు పరిష్కరించడానికి ప్రతిపాదించిన పనులను వెనువెంటనే చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటి అగ్రహారం రోడ్ విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి రోడ్ నిర్మాణం చేయాలని, దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీకలవాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాల్వల్లో తీస్తున్న సిల్ట్ ని వెంటనే తొలగించక పోవడం వలన మరలా అది కాల్వలోనే పడుతుందన్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్ధాలు ఉంటున్నాయని, వాటిని తొలగించడానికి కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. నియోజకవర్గంలోని పార్క్ లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధి పై వివరాలు ఇవ్వాలన్నారు. వీధి దీపాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
సమావేశంలో ఎస్ఈ శ్యాం సుందర్, ఈఈలు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, ఏడీహెచ్ రామారావు, డిఈఈలు రమేష్ బాబు, మహ్మద్ రఫిక్, కళ్యాణ రావు, శివ కుమార్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …