Breaking News

ఆధునాతన టెక్నాలజీతో బజాజ్‌ ఆటో పల్సర్‌లో ఎన్‌ఎస్‌400జడ్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బజాజ్‌ ఆటో పల్సర్‌లో ఎన్‌ఎస్‌400జడ్‌ 400 సీసీ బైక్‌ను అధునాతన టెక్నాలజీతో శుక్రవారం ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్‌ అఫ్‌ ఇంజనీరింగ్‌ Ê టెక్నాలజీ డైరెక్టర్‌ జోజి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదత్‌ బాషా ఏరియా సేల్స్‌ మేనేజర్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ ఈ వాహనంలో 4-స్ట్రోక్‌ లిక్విడ్‌ కూల్డ్‌, ఫ్యూయల్‌ ఇంజక్షన్‌ సిస్టమ్‌, 40 హార్స్‌ పవర్‌, 35 ఎన్‌.ఎం.టార్క్‌ అందించగల, 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ కొత్త పల్సర్‌లో 3 డిడెకాల్‌, డిజిటల్‌ బ్లూటూత్‌ కాల్‌ మానేజ్మెంట్‌, యుఎస్‌బి ఛార్జింగ్‌ పోర్ట్‌, నోటిఫికేషన్స్‌ వంటి ఫీచర్స్‌ ఇవ్వటం జరిగినది. దీని ఎక్స్‌ షోరూం ధర రూ.1,84,998లు. ఈ కార్యక్రమంలో సీఈఓ పద్మజ, వరుణ్‌ బజాజ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *