Breaking News

అర్బన్ బ్యాంకు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ది రాజమహేంద్రవరం ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు శనివారం జరిగిన ఓటింగ్ లెక్కింపు ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అత్యంత పగడ్బందీ గా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా లెక్కించవలసి ఉందన్నారు. మొత్తం 74,585 మంది ఓటు హక్కు కలిగి ఉండగా , వారిలో 25.31 శాతం సుమారు 18,800 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వివరించారు. ఇందు కోసం తగిన సిబ్బందిని నియమించుకున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా లెక్కింపును అత్యంత పకడ్బందీగా చేపట్టాలన్నారు. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట రాజమండ్రి ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డి సి వో ఆర్. శ్రీరాములు నాయుడు, ఎన్నికల అధికారి వి కృష్ణ కాంత్, డీ ఎస్పీ విజయ పాల్, ఇతర అర్బన్ బ్యాంకు అధికారులు, కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *