Breaking News

ఆంధ్రరత్న భవన్ లో ఖర్గే జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అలుపెరుగక కృషి చేస్తున్న శ్రీ ఖర్గే గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురునాధం, నరహరసెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, ఖుర్షీదా, అన్సారీ, బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *