Breaking News

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటాం… వాటి పరిష్కారానికి కృషి చేస్తాం

జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
-వైసీపీ నేతలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు
-టీడీపీ నేతలు సహనంతో ఉండాలి… సమస్యలు ఉంటే టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి తెలియజేయాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ నేతలకు అబద్దాలు ఆడటం వెన్నతో పెట్టిన విద్యని… దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ రెడ్డి, ఆపార్టీ నేతలు మాట్లాడుతున్నారని.. మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిగ్గులేకుండా డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేసిన వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో నేడు నిరసన చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. చంద్రబాబు ముందుచూపుకు ఆయన కార్యదక్షతకు ఎన్ని జన్మలెత్తిన ఆయన రుణం తీర్చుకోలేము. నేడు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి చూసిన గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలు అన్నీ కూడా వైసీపీలో జరిగిన అరాచకాలపైనే. గత ఐదేళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి… రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపారు. నేడు సిగ్గులేకుండా ప్రజాస్వామ్యం భాగలేదని… ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడుతున్నారు. గవర్నర్ దగ్గరకు వెళ్లి వైసీపీ నేతలు లెటర్ ఇవ్వడం రాష్ట్ర పతి పాలన పెట్టాలని కోరడం చూస్తుంటే నవ్వు వస్తోంది. గురిగింజ తనకింద ఉన్న నలుపును చూసుకోకుండా మాట్లాడినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దెబ్బలాటకు, కోట్లాటకు ఆద్యులే వైసీపీ నేతలు. సొంత బాబాయి చనిపోయినప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్లి జగన్ రెడ్డి ఎందుకు అర్జీ ఇవ్వలేదు? వివేకానందరెడ్డిని కండకండాలుగా గొడలితో నరికి చంపి గుండెపోటు డ్రామాలు ఆడి నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా సిగ్గులేకుండా.

మీ చినాన్న హత్యపై సొంత అక్కచెల్లెల్లు పోరాడుతుంటే ఎందుకు జగన్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు.? నేడు ఢిల్లీకి వెళ్లి వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ ఎంక్వైరీకి ఢిమాండ్ చేయగలవా జగన్ రెడ్డి ? గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి రోజు కూడా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన రోజు. కక్షపూరితంగా ఎవరైనా కొట్టుకుంటే దాన్ని కూటమికి ఆపాధిస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు అబద్దాలు ఆడటం వెన్నతో పెట్టిన హత్య. 30 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఒక్క రోజు కూడా జగన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. నేడు 36 మంది చనిపోయారని పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్లు.. జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడు. ఎవరైనా చనిపోతే.. ఎలా మాట్లాడాలో కూడా జగన్ రెడ్డికి తెలియడంలేదు.. ఒక సైకోలా నవ్వుతూ బాధితుల వద్ద పథకాల గురించి మాట్లాడుతున్నాడు. డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి. డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ సుధారాణిని ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరి చేసిన వ్యక్తి నేడు ప్లకార్డులతో ప్రజాస్వామ్యం గుచించి మాట్లాడటం హాస్యాస్పదం. కోడికత్తి శ్రీను, ఓం ప్రతాప్, హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, శాంకుమార్, కర్రి శ్రీకాంత్, జర్జి రామకృష్ణ వీళ్లు గుర్తులేదా…? ఇలా ఎంతమంది మీ చేతుల్లో హతులు అయ్యారో కదా జగన్ రెడ్డి. నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్నను ఎవరు చంపారో సీబీఐ ఎంక్వైరీ కోరండి. సీబీఐ అధికారులు వస్తే బాంబులు వేస్తామన్న వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా దౌర్భాగ్యం.

గత ఐదేళ్లు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. బ్రిటీస్ పాలనలో ఉన్నామా అని ప్రజలు మధనపడ్డారు. ఎప్పుడు ఈ దుర్మార్గుడి సైకో పాలన పోతుందా అని ఎదురు చూశారు. రాత్రి 11 వరకు క్యూలో నిలబడి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లు 164 సీట్లతో గెలిపించుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఓపిక లేని వైసీపీ నేతలు ప్రజాస్వామం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. అసలు వైసీపీ నేతలకు పరువేలేదు. వైసీపీ నేతల అరాచకాలను వద్దనే ప్రజలు వారి పాలనను పాతిపెట్టారు. మాకు చంద్రబాబు క్రమశిక్షణ నేర్పించారు. నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే మా నాయకుడు ఒక కంటి సైగ చాలు. మేము అక్కర్లేదు… వైసీపీ నేతల చేతిలో బాధింపబడిన కార్యకర్తలే వైసీపీ నేతలకు బుద్ధి చెబుతారు. కాని వైసీపీ నేతలు తప్పు చేశారని మేము తప్పు చేయకూడదని.. వైసీపీ నేతలు గడ్డి తిన్నారని మేము తినకూడదని… ప్రజాస్వామ్యంగా నడుచుకోవాలని మా నాయకుడు మాకు సూచించారు.

53 రోజులు జైల్లో పెట్టి మా నాయకుడిని ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా మా నాయకుడు హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు వైసీపీ నేతలు కవాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఐదేళ్లు బయటకు రాని వ్యక్తి శవం కనిపించగానే బయటకు వచ్చాడు. బాధితుల దగ్గరకు వచ్చిన నాయడు ఏమి మాట్లాడాలి… వారి కష్ట సుఖాల గురించి తెలుసుకోవాలని కాని జగన్ రెడ్డి మాటలను చూస్తే తనకు బుర్రపోయింది అనుకోవాల్సిందే. ప్రజలు సైకో చేష్టలను గమనించాలి. ఎల్లప్పుడూ మేము పార్టీ ఆఫీసులో ప్రజలు, కార్యకర్తలకోసం అందుబాటులో ఉంటాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి చెప్పాలి. చట్టపరంగా ముందుకు వెళ్తాం. ఎటువంటి ఆవేశాలకు లోనుకావద్దు.

కావలి ప్రతిభా భారతి మాట్లాడుతూ.. అటు రాయలసీమ నుండి ఇటు శ్రీకాకుళం వరకు ప్రజలు అర్జీలు తీసుకుని వస్తున్నారు.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్ మెంట్ లకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు ప్రజా శ్రేయస్సును కోరుకునే వ్యక్తి.. ఆయన బాటలోనే నాయకులు కార్యాలయంలో అందుబాటులో ఉంటూ. వివిధ సమస్యలపై కార్యాలయానికి వస్తున్న ప్రతి ఆర్జీని పరిశీలించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ఒక్క అర్జీని తీసుకోలేదు. ఒక్క రోజు కూడా ప్రజలను కలవలేదు. బయటకు రావాలంటే పరదాలు కట్టుకున్నాడు. పోలీసుల పహారా పెట్టుకున్నాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజా నాయకుడు ఎవరో ప్రజలే గమనించాలి. ప్రజా ప్రభుత్వం ఏదో ప్రజలే అర్థం చేసుకోవాలి.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *