Breaking News

ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు కాబట్టే జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు

-జగన్ భవిష్యత్తు అంతా అంధకారమయమే
-డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు కాబట్టే ఎన్నికల్లో జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…. ఐదేళ్లపాటు రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన జగన్ రెడ్డి నేడు మెడలో నల్ల కండువాలు వేసుకుని నిరసన తెలపడం విడ్డూరం. అసెంబ్లీలో అరగంట సేపు కూడా కూర్చోకుండా బయటికి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడండoటూ నిరసన తెలపడం విడ్డూరం. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడబట్టే టిడిపిని గెలిపించి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా తనకు కావాలనడం సిగ్గుచేటు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని నాడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు జగన్ మర్చిపోయారా ? జగన్ జీవితమంతా మాట తప్పడం మడమ తిప్పడమే. జగన్ భవిష్యత్తు అంతా అంధకారమయమే అందుకే నల్ల కండువాలతో నిరసన తెలుపుతున్నాడు. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మాని బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *