మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పుటకు అవసరమైన భూముల అలినేషన్, ముటేషన్ చేయుటకు ప్రతిపాదనలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర రావుతో కలిసి రెవెన్యూ శాఖ, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల అలినేషన్, ముటేషన్, 22 ఏ తొలగింపులు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. చల్లపల్లి, వీరపనేనిగూడెం, మల్లవల్లి, గంగాధరపురం, గుడివాడ లలో పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా అవసరమైన భూములను సేకరించుట కోసం అలినేషన్, ముటేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే 22 ఏ పరిధి నుండి భూములను తొలగించేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం, గుడివాడ ఆర్డిఓలు ఎం వాణి పి. పద్మావతి,ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సీతారామయ్య, డిజడ్ఎమ్ మధుసూదన్ తహసిల్దారులు పాల్గొన్నారు.