Breaking News

ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం

-వివిధ ఉత్పత్తులకు డిజిటల్ కామర్స్ మార్కెట్ కల్పనపై చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. డిజిటల్ కామర్స్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వృద్ధిని సాధించే అంశంపై చర్చించారు. ఆయా ఉత్పత్తులను డిజిటల్ కామర్స్, మార్కెట్ అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా చర్చించారు. రైతులు, నేత కార్మికులు, కళాకారులు, డ్రైవర్లు, స్టార్టప్‌లు, MSMEలు, చిన్న దుకాణదారులతో సహా వివిధ వర్గాల ప్రజల జీవితాలను మార్చడానికి ONDC యొక్క ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడంపై చర్చించారు. ONDC ప్లాట్‌ఫారమ్ ఇ-కామర్స్‌ ద్వారా కొనుగోలుదారులు, విక్రేతలు సులభంగా అనుసంధానం అయ్యేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనిలో భాగంగా హార్టికల్చర్, ఆక్వా తదితర రంగాల ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు సాగించే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *