Breaking News

సురక్షితమైన త్రాగునీరు నే ప్రజలకు అందించండి

-నిరంతరం త్రాగునీటి నమూనాలు సేకరిస్తూ పరీక్షలు నిర్వహించండి
-ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సర్కిల్ 2, పరిధిలో ఉన్న 58వ డివిజన్లో గల ఇంద్ర నాయక్ నగర్, నందమూరి నగర్, కనకదుర్గ నగర్ వాటర్ ట్యాంక్ పర్యటించి క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరా పరిశీలించారు. ప్రజలకు శుద్ధమైన సురక్షితమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ ప్రతిరోజు చేస్తున్న నీటి పరీక్షలను మంగళవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజల ఇంటి వద్ద సేకరించిన నీటి నమూనాలతో రేసిడ్యువల్ క్లోరిన్ పరీక్ష పరిశీలించారు. అదే పరిధిలో గల వాటర్ ట్యాంక్ లో ఉన్న నీటిని కూడా పరిశీలించి ప్రజలకు తాగునీటి సరఫరాలో సురక్షితమైన త్రాగునీటినే సరఫరా చేసేటట్టు నిరంతర పరీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *