Breaking News

క్రీడలతో శారీరకదారుఢ్యం, మేధస్సు పెరుగుతుంది

-సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దారుఢ్యం, మేధస్సు కూడా పొందవచ్చని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ‘శిక్షా సప్తాహ్’ లో భాగంగా బుధవారం పటమట కేబీసీ బాయ్స్ హైస్కూల్లో మూడో రోజు జరిగిన ‘క్రీడా దినోత్సవం’ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాలీబాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్, సెపక్ తక్రా తదితర ఆటలు పరిశీలించి, విద్యార్థులతోకలిసి ఆడారు. కార్యక్రమంలో స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *