Breaking News

డెంగ్యూ నివారణలో సమాజభాగస్వామ్యం

-ఏడీ డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలం ప్రజలను పీడించే వ్యాధుల్లో ఒకటైన డెంగ్యూ నివారణలో సామాజిక భాగస్వామ్యం అత్యవసరమని ఆరోగ్యశాఖ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ బి. సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. డెంగ్యూ నివారణ కోసం ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహిస్తున్నందున ఏడిస్ లార్వా నిర్మూలన కోసం ఒక వారానికి పైగా నీటి నిల్వ కంటైనర్లను క్లియరెన్స్ చేయాలని ఆమె కోరారు. డెంగ్యూ నివారణ మాసం(జూలై) చర్యల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ బి. సుబ్రహ్మణ్యేశ్వరితో పాటు గుంటూరు డిఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, జోనల్ మలేరియా అధికారిణి డాక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మంగళగిరి లక్ష్మీపతి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్, ఎంటమాలజీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జి. వీర్రాజు మరియు ఇతర క్షేత్ర సిబ్బంది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సమీపంలోని చెరువులో ‘గంబూసియా చేపల’ను వదిలారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *