Breaking News

“రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.. ప్రకాష్ బాబు, “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె . ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతి వేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, చట్టరిత్య నేరం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులను జాగృతి చేశారు.

ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అభిరామ్ , ఎస్ ఐ, ఆర్ పి ఎఫ్, సి. విశ్వ నాధ్, పారా లీగల్ వాలంటీర్లు,
కె.పెద్దిరాజు, జె. పాండవులు, వై వెంకటేశ్వర రావు, పాలూరి శ్రీనివాస్, పి.ప్రశాంతి, వసంత రాయుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం సిబ్బంది , పారా లీగల్ వాలంటీర్లు, రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *