-కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లాకు 368 మంది పిల్లలకి ఆర్ధిక చేయూత కింద రూ.88 లక్షల 32 వేలు అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేసారు. శుక్రవారం కలెక్టరు ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం కింద లబ్దిదారుల పిల్లలకు ఆరు నెలల ప్రయోజనం విడుదల కోసం కలెక్టర్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ మిషన్ వాత్సల్య పథకం కింద పూర్తి , పాక్షిక నిరాధరణకు గల పిల్లలను , అదే విధంగా ఎయిడ్స్ బాధిత తల్లితండ్రులు పిల్లలను గుర్తించి వారికి ప్రతినెలా రూ.4 వేలు చొప్పున రెండు సంవత్సరాలు పాటు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతోందని అన్నారు. పిల్లల సంస్థాగతీకరణ సూత్రం ఆధారంగా క్లిష్ట పరిస్థితుల్లో పిల్లల కుటుంబ ఆధారిత నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్ కోసం 18 ఏళ్ల లోపు పిల్లలకి ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి కి చెందిన 187, ప్రస్తుత తూర్పు గోదావరీ జిల్లాలో 181 మంది వెరసి 368 ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏప్రియల్ 2023 నుంచి సెప్టెంబర్, 2023 నెలలకి చెందిన ఆరు నెలలకి చెందిన రూ.88 లక్షల 32 వేలు విడుదల చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ పిడి కె. విజయ కుమారి, జిల్లా పిల్లల సంరక్షణా అధికారి సి. రాజ్ కుమార్ , కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.