Breaking News

ఘనంగా 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమము

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
26 జూలై 1999న పాకిస్తాన్ పై భారత సైన్యం సాధించిన ఘన విజయంను పురస్కరించుకొని వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను, భారత రక్షణ దళములలో సేవలందిస్తున్న సైనికులు, సేవలు అందించిన మాజీ సైనికులును గుర్తు చేసుకొంటూ 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంను ఈ రోజు అనగా తేదీ: 26జూలై 2024న సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ కళ్యాణవీణ. కె (రిటైర్డ్), జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి, ఎన్.టి.ఆర్ &కృష్ణా జిల్లా @ విజయవాడ వారి ఆద్వర్యంలో జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, విజయవాడ నందు జరుపబడినది. ఈ కార్యక్రమము నందు కృష్ణా మరియు ఎన్.టి.ఆర్. జిల్లాల నుండి కార్గిల్ యుద్దంలో లో పాల్గొన్న మాజీ సైనికులసేవలను కొనియాడుతూ వారిని ఘనముగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమములో మాజీ సైనికులు వారి యుద్ద సమయంలో జరిగిన సంఘటనలు, అనుభవాలును సవివరముగా వివరించడం జరిగినది. ఈ కార్యక్రమములో మాజీ సైనికులు మరియు కుటుంబ సబ్యులు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి మరియు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *