మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పాల్గొన్నారు. ఉచిత ఇసుక అమలులో భాగంగా స్టాక్ యార్డులలో అందుబాటులో ఉన్న ఇసుక వివరాలు, రవాణా చార్జీలు, సమస్యలు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గనులు, రవాణ, భూగర్భ జల, ఎన్ఫోర్స్మెంట్, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గనులశాఖ ఇన్చార్జి ఏడి కొండారెడ్డి, సూపరింటెండెంట్ రామకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి.ఎల్. సిద్ధిక్, భూగర్భ జల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు