-కలెక్టర్ మరియు తిరుపతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా.ఎస్. వెంకశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిందాల్ పవర్ లిమిటెడ్, సింహపురి యూనిట్ వారు తిరుపతి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) రక్త నిధి కేంద్రానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా రూ.12 లక్షల విలువైన రక్త నిధి పరికరాలు,ఎయిర్ కండీషనర్లు మరియు కంప్యూటర్ విత్ ప్రింటర్ వంటివి వితరణ చేయడం ఎంతో అభినందనీయం అని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు జిందాల్ పవర్ లిమిటెడ్, సింహపురి యూనిట్ హెడ్ కె. శ్రీనివాస రావు, జోబిన్ మ్యాథ్యూస్ సీఎస్ఆర్ హెడ్ వారు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) రక్త నిధి కేంద్రానికి సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.12 లక్షల విలువైన రక్త నిధి పరికరాలు, ఎయిర్ కండీషనర్లు మరియు కంప్యూటర్ విత్ ప్రింటర్ వంటివి జిందాల్ పవర్ ప్లాంట్, సింహపురి తరపున తిరుపతి జిల్లా కలెక్టర్ & ఐఆర్సీఎస్ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షులు అయిన డా. ఎస్. వెంకటేశ్వర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ తిరుపతికి వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో లైసెన్సింగ్ అధికారి ఖలీల్, ఐఆర్సిఎస్ తిరుపతి జిల్లా బ్రాంచ్ వైస్ చైర్మన్ బి శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ జి ప్రతీత్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శివకుమార్, సుధీర్, గుణశేఖర్ శాశ్వత సభ్యులు రత్నప్రభ, వై ఆర్ సి స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.