విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
26 జూలై 1999న పాకిస్తాన్ పై భారత సైన్యం సాధించిన ఘన విజయంను పురస్కరించుకొని వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను, భారత రక్షణ దళములలో సేవలందిస్తున్న సైనికులు, సేవలు అందించిన మాజీ సైనికులును గుర్తు చేసుకొంటూ 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంను ఏపీ స్టేన్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు శుక్రవారం తమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ కార్గిల్ యుద్దంలో లో పాల్గొన్న మాజీ సైనికుల సేవలను కొనియాడారు. మాజీ సైనికులు వారి యుద్ద సమయంలో జరిగిన సంఘటనలు, అనుభవాలును వివరించారు. దేశం శాంతియుతంగా ఉండేందుకు, అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూసేందుకు సైనికులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో సైనికులు చేసిన అత్యున్నత త్యాగాలను స్మరించుకోవాలన్నారు. జీవితానికి, కార్గిల్ యుద్ధానికి మధ్య ఉన్న సారూప్యతలను వివరిస్తూ, చారిత్రక సంఘటనలు భవిష్యత్తు తరాలకు కొన్ని పాఠాలను మిగులుస్తాయని అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని గొప్ప, శక్తివంతమైన దేశంగా మార్చేందుకు, కార్గిల్ యుద్ధంలో సాధించిన చిరస్మరణీయ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసోసియేషన్ సభ్యులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …