Breaking News

వేడుకలకు స్టేడియంను సిద్దం చేయండి…

-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన తెలిపారు. ఆగస్టు 15వ తేదీన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి చేయవలసిన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జి. సృజన, ఏపిఎస్‌పి డిఐజి బి. రాజకుమారి, నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు, మున్సిపల్‌ కమీషనర్‌ హెచ్‌ యం ధ్యాన చంద్ర లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఇంధిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్నారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ మాన్యశ్రీ తో పాటు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు వేడుకలలో పాల్గొంటారన్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌, నగరపాలక సంస్థ, రెవెన్యూ, ఆర్‌అండ్‌ బి, ట్రాన్స్‌కో, ఫైర్‌, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రారంభించాలన్నారు. ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసి స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో నిర్వహించిన వేడుకలలో ఎదురైన లోటుపాట్లను గుర్తించి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లపై జిల్లా అధికారులకు అప్పగించిన భాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ సృజన తెలిపారు. పరిశీలనలో ఆర్‌డివో బిహెచ్‌ భవాని శంకర్‌, డిసిపిలు గౌతమ్‌ శాలి, ఏబిటిఎస్‌ ఉదయరాణి, కె. చక్రవర్తి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *