-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, పిసిఆర్ ఫ్లైఓవర్, ఎంజీ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, పిసిఆర్ ఫ్లైఓవర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరాన్ని మరింత అందంగా ఆహ్లాదంగా మార్చేందుకు మొక్కలను నాటుత, వాల్ పెయింటింగ్లను పెంచమన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే బ్యానర్లను వెంటనే తీసివేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ వాల్ పెయింటింగ్స్ వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రజలకు పబ్లిక్ టాయిలెట్స్ ని నిర్మించుటకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నగరంలో, డివైడర్లపై మొక్కలని మరింత పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు కల్పించాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ కి ఆదేశాలు ఇచ్చారు.
ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తో పాటు అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, జోనల్ కమిషనర్ వన్ రమ్య కీర్తన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1 ఏ ఎస్ ఎన్ ప్రసాద్, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ చీరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2 శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు