-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో కోరారు. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులై ఇంగ్లీష్ భాష చదవడం, వ్రాయడంలో నైపుణ్యంగల గిరిజన యువతీ యువకుల కొరకు సికింద్రాబాద్కు చెందిన ఎస్కె సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెంట్ కెఎల్ గ్రూప్ వారి సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. జూలై 31వ తేదీన విజయవాడ సమీపంలోని గొల్లపూడి నందుగల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్డిఏ) కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాలో అర్హత కలిగిన గిరిజన యువతకు పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్, లోడింగ్ ,అన్ లోడింగ్ వంటి ఉద్యోగాలలో అవకాశం కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. వారానికి ఐదు రోజులు షిప్టులు వారిగా పనిచేయవలసి ఉంటుందని నెలకు 17000 రూపాయల జీతం, పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్య తో పాటు అదనపు పనికి కూడా వేతనం కల్పిచడం జరుగుతుందన్నారు. పైన తెలిపిన ఉద్యోగాలకు ఆసక్తిగల గిరిజన యువత బయోడేటాతో పాటు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్, కుల దృవీకరణ పత్రం, ఆదార్కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు సైజ్ ఫోటోతో 31వ తేదీ ఉదయం 10 గంటలకు డిఆర్డిఏ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. జాబ్ మేళా కార్యక్రమాన్ని జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి జె. సునీత పర్యవేక్షిస్తారని ఇతర వివరాలకు 7893751698 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ప్రకటనలో తెలిపారు.