-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ కల్పించిన వసతులను సులువుగా తెలుసుకునేందుకు ఆ ప్రదేశాలను చూపించే సైన్ బోర్డు లను నగరం మొత్తం పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం ఉదయం ఎంజీ రోడ్, పటమట, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పబ్లిక్ టాయిలెట్లు, అన్న క్యాంటీన్లకు, మొదలగు విజయవాడ నగరపాలక సంస్థ కల్పిస్తున్న వసతులు అన్నిటికీ అవి ఎక్కడున్నాయో ప్రజలకు తెలిపే సైన్ బోర్డులను నగరం మొత్తం అమరచాలని, తద్వారా ప్రజలకు సులువుగా వాటిని తెలుసుకునే అవకాశం కల్పించవచ్చని అన్నారు. తదుపరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సందర్శించి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ నగర పలక సంస్థ తీసుకోవాల్సిన చర్యలను, ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అన్నారు.
పటమటలో పర్యటించి అక్కడ జరుగుతున్న డీసెల్టింగ్ పనులను పరిశీలించారు, డిసిల్టింగ్ పనులను ఏ విధంగా చేస్తున్నారు దానికి వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సైడ్ డ్రైనలను మ్యాప్ లో మార్కింగ్ చేసుకుంటూ శుభ్రపరచుకుంటే సైడ్ డ్రైనలలో పూడికల సమస్య పరిష్కరించవచ్చని అన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద హోర్డింగ్ లు చూసి, వాటికి స్ట్రక్చరర్స్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉన్నాయో లేవో పరిశీలించవలసిందిగా టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికెట్లు ప్రతి హోర్డింగ్ అవసరమని దానికి తగు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవళి, జోనల్ కమిషనర్లు కే ప్రభుదాస్, శివరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్, ఏ ఎస్ ఎన్ ప్రసాద్, సామ్రాజ్యం, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చీరన్ రాయ్, తదితరులు పాల్గొన్నారు.