Breaking News

ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఏపీపీఎస్సీ, పోలీస్, మెడికల్, విద్యుత్ శాఖ అధికారులతో మే 2024 సెషన్ కు సంబంధించిన ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. పెనమలూరు మండలం కానూరు గ్రామంలోని అయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏపీపీఎస్సీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *