Breaking News

జాబ్ మేళా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాల ప్రకారం కృష్ణా జిల్లా లో గిరిజనులు 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై మరియు ఇంగ్లీష్ భాష చదవటం మరియు వ్రాయగల నైపుణ్యముతో అర్హులైన గిరిజనుల కొరకు SK Safety Wings (P) Ltd., Secunderabad వారి సౌజన్యముతో జాబ్ మేళ నిర్వహించన పిదప సెలెక్ట్ అయిన గిరిజనులకు పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్, లోడింగ్ మరియు అన్ లోడింగ్ వంటి ఉద్యోగ అవకాశములు కల్పించుచు వారానికి 5 రోజులు షిఫ్ట్ ల వారీగా (పగలు, రాత్రి) నెలకి రు.17,000/-లు జీతము తో (పి.ఎఫ్ + ఈ ఎస్ ఇ) మరియు వీటితో పాటు అదనపు పనికి కూడా వేతనము కల్పించబడునని తెలపడమైనది. కావున, పై తెలిపిన విధముగా ఈ జిల్లా నందు అర్హులైన నిద్యోగ గిరిజన యువతి, యువకులు ఉద్యోగములు కొరకు ఆసక్తిగల వారు ది.25.07.2024 నుండి 31.07.2024 వరకు సాయంత్రము గం.5.00 లోగా కలెక్టరేట్ కాంపౌండ్ లో జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి, కృష్ణా, మచిలీపట్నం వారి కార్యాలయము నందు ధరఖాస్తుతో ఈ క్రింద తెలిపిన వాటిని జతపరిచి సమర్పించగలరని తెలియజేయడమైనది.

గమనిక: 1. బయోడేట తో 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు.
2. కుల దృవీకరణ పత్రము మరియు ఆధార్ కార్డు, రెషన్ కార్డు, ఫోటో మొదలగునవి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ :
9502082159, 7794927921
7993587130

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *