Breaking News

ఇంటర్ మీడియట్ తర్వాత ఐటి రంగంలో విద్య మరియు ఉపాధి..

-టెబ్బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు హెచ్ సి ఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ విద్యను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పన..
-రాష్ట్రం లోని జిల్లాల వారీగా ప్రత్యేకమైన డ్రైవ్ ల ద్వారా విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక..
-ఇంటర్ మీడియట్ లో ఒకేషనల్, సిఇసి, హెచ్ ఇ సి, బైపీసీ విద్యార్థులకు అర్హత..
-ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సిఇఓ ఎన్. సుర్జీత్ సింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐటి సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ విద్యను ఒక సంవత్సరం కాలం పాటు అందజేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సిఇఓ ఎన్. సుర్జీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు భారత దేశంలో పేరొందిన ఐటి కంపెనీల్లో ఒకటైన హెచ్ సి ఎల్ కంపెనీ డిజిటల్ విద్యను అందించి ఉపాధి కల్పించడం జరుగుతుందని ఉపాధి పొందుతూనే విద్యార్థులు ఉన్నత విద్యను సైతం పొందవచ్చునని అయన తెలిపారు.
ఈ ఐటి విద్యను పొందడానికి విద్యార్థులు ఇంటర్ మీడియట్ తత్సమాన కోర్సు ను 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండాలన్నారు. విద్యార్థినీ విద్యార్థులు తప్పనిసరిగా ఒకేషనల్, సిఇసి, హెచ్ ఇ సి, బైపీసీ గ్రూప్ లలో చదివి ఉండాలన్నారు. ఏడాది కాలం పాటు టెబ్బీ ప్రోగ్రాం కు ఎంపిక అయిన అభ్యర్థులు శిక్షణ అనంతరం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధి పొందుటకు అర్హులుగా నిర్దేశించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట హెచ్ సి ఎల్ కెరీర్ ఆప్టి ట్యూడ్ టెస్ట్ ఉంటుందని, అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్ వ్యూ ఉంటుందన్నారు. ఇంటర్ వ్యూ లో ఎంపికైన అభ్యర్థులకు వర్సoట్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుందన్నారు. ఈ ప్రక్రియల్లో విజయం సాధించిన విద్యార్థులకు నియామక పత్రం అందించడం జరుగుతుందని సిఇఓ చెప్పారు.
అభ్యర్థులకు ఏడాదికాలం పాటు మధురై, చెన్నై నగరాల్లో నెలకొన్న హెచ్ సి ఎల్ కేంద్రాల్లో శిక్షణను అందించడం జరుగుతుందని చెప్పారు. మూడు నెలల పాటు తరగతి గదుల శిక్షణ, మిగిలిన 9 నెలలు ఇంటర్న్ షిప్ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులకు నెలకు 10 వేల రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారని చెప్పారు. పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఎంపిక అయిన వారికి సంవత్సరానికి రూ. 1.7 లక్షల వేతనం ఉంటుందని పనితీరు ఆధారంగా ప్రతీ సంవత్సరం వేతనంలో పెంపు ఉంటుందని చెప్పారు. హెచ్ సి ఎల్ లో ఉద్యోగం చేస్తూనే శాస్త్ర, అమిటీ, కెఎల్ యూనివర్సిటీలలో ఉన్నత విద్య చేసుకునే అవకాశం సైతం ఉన్నదని చెప్పారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ కోసం registrations.hcltechbee.com ను వీక్షించాలని చెప్పారు. 2024 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయినదని సిఇఓ చెప్పారు. ఇతర వివరాలకు 9642973350, 7780323850, 7780754278, 6363095030 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు. జిల్లాల వారీగా కృష్ణా ఆగష్టు 6న, నెల్లూరు ఆగష్టు 8న, గుంటూరు, ప్రకాశం, చిత్తూర్ లలో ఆగష్టు 9న, కడప ఆగష్టు 10న, కర్నూలు ఆగష్టు 13న, అనంతపురం ఆగష్టు 17న, పశ్చిమ గోదావరి ఆగష్టు 19న, తూర్పు గోదావరి ఆగష్టు 20న, విశాఖ ఆగష్టు 22న, విజయనగరం ఆగష్టు 23న, శ్రీకాకుళం ఆగష్టు 24 తేదీలలో ఐటి కోర్సు లలో ఎంపికకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని సిఇఓ తెలిపారు.

ఇంటర్ తర్వాత ఏడాది శిక్షణ – డిజిటల్ సపోర్టు ఉద్యోగం
ఈ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు కొర్నాని యామిని, షేక్ అర్షద్, పడవల వినోద్ రాజ్, ఉప్పల వెంకట కావ్య లు మాట్లాడుతూ తాము హెచ్ సి ఎల్ లో ఉద్యోగం చేస్తూనే ఉపాధి పొందడంతో పాటుగా ఉన్నత విద్యను సైతం అభ్యసిస్తూ జీవితంలో రాణించామని చెప్పారు. ఈ కోర్సును పూర్తి చేయడం వలన మెరుగైన ఫలితాలను పొందడంతో పాటుగా ఉన్నత విద్య మరియు ఉన్నత ఉద్యోగం ఎక్కువ వేతనం పొంది జీవితాన్ని సార్థకత చేసుకున్నామని తమ మాటల్లో చెప్పారని ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సిఇఓ ఎన్. సుర్జీత్ సింగ్ ఆ ప్రకటనలో చెప్పారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *