Breaking News

ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె . ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కారాగారంలోని వసతులను, సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అన్నారు. ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అన్నారు. వారికి ఎలాంటి న్యాయ సమస్యలున్నా పారా లీగల్ వాలంటీర్ల ద్వారా కానీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా కానీ సంస్థకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ , జైళ్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.రాజ కుమార్ , బి.రత్న రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *