-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కేఎల్ రావు నగర్ లో సోమవారం గుండెపోటుతో మరణించిన గుడిమెట్ల ఆశమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 47 వ డివిజన్ టిడిపి డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు తో కలిసి పరామర్శించారు. నిరుపేద అయినటువంటి గుడిమెట్ల ఆశమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని నాగోతి రామారావు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అశమ్మ భర్త జాన్ సుందర్ రావుకు మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది నగదును అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నగదును ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది అందజేశారు.