Breaking News

పెన్షన్ల పంపిణీ పెన్షనర్ల ఇంటి వద్దనే నూరు శాతం జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ పెన్షనర్ల ఇంటి వద్దనే నూరు శాతం జరగాలని, పెన్షన్ల పంపిణీలో ఏ సమస్య రాకుండా నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర కమిషనర్ గా భాధ్యతలు తీసుకున్న అనంతరం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతలతో పెన్షన్ పంపిణీ, ఇతర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ (ఎఫ్ఏసి) మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆగస్ట్ 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని పగడ్బందీగా పంపిణీ చేయాలన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా విధులు కేటాయించిన నోడల్ అధికారులు పెన్షన్ల పంపిణీని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, బుధవారం సాయంత్రానికి పూర్తిగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంపిణీ వివరాలు ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపాలన్నారు. అలాగే ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులు మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. అవుట్ ఫాల్ డ్రైన్లలో వర్షం నీరు నిల్వ లేకుండా పర్యవేక్షణ చేయాలని, త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
అనంతరం విభాగాధిపతులు, అధికారులు కమిషనర్ కు పూల బొకేలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, వెంకట లక్ష్మీ, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్ఈ శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *