Breaking News

ఆగస్ట్ మొదటి వారంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్ష నేపథ్యంలో అధికారులు నివేదికలు సిద్ధం చేయండి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి గారి కలెక్టర్ల సమీక్ష ఆగస్ట్ మొదటి వారంలో ఉన్న నేపథ్యంలో మునిసిపల్ కార్పొరేషన్, పరిశ్రమలు, పర్యాటక తదితర ముఖ్య శాఖల అధికారులు ప్రెజెంటేషన్ సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు ఆగస్ట్ నెలమొదటి వారం గౌ. ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై మునిసిపల్ కార్పొరేషన్, పర్యాటక శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ తదితర శాఖలపై సమీక్షిస్తూ పవర్ ప్రెజెంటేషన్ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జెడి పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్, జడ్ ఎం ఏపీ ఐఐ సి చంద్ర శేఖర్, ఎస్డిసి నరసింహులు, సంచాలకులు పర్యాటక శాఖ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *