Breaking News

అమర రాజా గ్రూపులో ఉద్యోగాల కొరకు పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అమర రాజా గ్రూపులో ఉద్యోగాల కొరకు పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కష్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం ద్వారా పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లో ఉత్తీర్ణత అయిన యువతి యువకులకు అమరరాజా గ్రూప్ తిరుపతి నందు మిషన్ ఆపరేటర్స్ మరియు అప్రెంటిస్ ఉద్యోగాల కొరకు 07- 08-2024 తేదీన అనగా బుధవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించబడును అని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ గారు తెలుపుతూ జెసి శుభం బన్సల్ గారితో కలిసి సదరు పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లాలోని 10th పాస్/ఫెయిల్ లేదా ఇంటర్ పాస్ / ఫెయిల్ లేదా ఐటిఐ లో ఉత్తీర్ణత అయిన మరియు *16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ యువతి మరియు యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను అని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాథం గారు ఒక ప్రకటనలో తెలియజేశారు మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.

రిజిస్ట్రేషన్ లింకు: https://shorturl.at/ZKE8w

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 06-08-2024.

ఇతర వివరములు కొరకు సంప్రదించండి: 9177508279/9000024919.

గమనిక: అమరరాజా గ్రూపులో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన యువతి యువకులకు మొదటి మూడు నెలల వరకు ఉచిత శిక్షణ మరియు ఉచిత వసతి మరియు ఉచిత భోజన సదుపాయం తో పాటు 12400/- నుండి13500/- వరకు స్టైఫండ్ కల్పించబడును.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *