Breaking News

రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని పెండింగ్ ఎలక్ట్రిక్ పవర్ లైన్ షిఫ్టింగ్ పనులు ఆగస్ట్ 15 లోపు పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సుమారు 7 ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ లను ఆగస్ట్15 లోపు పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడిసిఎల్ తదితర సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి రేణిగుంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడిసిఎల్ తదితర అధికారులతో ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ల షిఫ్టింగ్ పై సమీక్షించి త్వరిత గతిన పూర్తి చేయాలి అని ఆదేశించగా సదరు అధికారులు 4 టవర్లను ఆగస్ట్ 8 నాటికి, మిగిలినవి ఆగస్ట్ 15 నాటికి షిఫ్టింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15 నాటికి సదరు పెండింగ్ అంశాలు పూర్తి చేయాలనీ కలెక్టర్ సూచించారు. అలాగే మీడియన్ లైట్ల ఏర్పాటు త్వరిత గతిన ఏర్పాటు చేసి లైటింగ్ బ్లాక్ స్పాట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రహదారులు భవనాల శాఖ వారు ఎయిర్ పోర్టు సమీప కూడలిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఏపీ ఎస్పీడిసిఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు, ఆర్ అండ్ బి ఎస్ఈ మధుసూధన్ రావు, ఏపీ ట్రాన్స్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *