విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోషల్ జస్టిస్ ఫోరం తరుపున ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా యర్రాకుల తులసిరామ్ యాదవ్ బి.సి సామాజిక ఉద్యమ నాయకులు, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ మరియు విద్యాసంస్థల అధినేత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిపల్లి అయ్యప్ప కాపు సామాజిక ఉద్యమ నాయకులు, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్, కోటిపల్లి కాలం ఎడిటోరియల్ కాలమిస్ట్లను సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన విజయవాడ గాంధీనగర్ లో ఆదివారం ప్రకటించారు. రావి శ్రీనివాస్ రాష్ట్ర కన్వీనర్ సోషల్ జస్టిస్ ఫోరం పంచాది రంగారావు రాష్ట్ర కో కన్వీనర్ సోషల్ జస్టిస్ ఫోరం, పెద్దిరెడ్డి మహేష్ రాష్ట్ర కో కన్వీనర్ సోషల్ జస్టిస్ ఫోరం, నల్లజర్ల రామారావు రాష్ట్ర కో కన్వీనర్ సోషల్ జస్టిస్ ఫోరం తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …