-జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభవేళ జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని.. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు మరింతగా ఆర్థికంగా బలపడేందుకు, ఆరోగ్యకర జీవితానికి ఈ కొత్త ఏడాది పునాది కావాలన్నారు.
Prajavartha Online Telugu News