Breaking News

Daily Archives: July 29, 2026

ఏపీలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీకి తైవాన్ కంపెనీల ఆసక్తి

-సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ లతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాత తయారీ, సాంకేతిక రంగాల్లో ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వివిధ అంశాలపై చర్చలు జరిపింది. తైవాన్ కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్ క్యూ, సీబీటీసీ బ్యాంక్, …

Read More »

ప్రజల భద్రత, వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యం

-దశాబ్దాల నుంచి నెలకొన్న మానవ–ఏనుగు సంఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ -ఆధునిక సాంకేతికతతో మన్యంలో అటవీ ఏనుగుల సమస్యకు పరిష్కారం -రైతుల పంటలు, ప్రజల ప్రాణాలకు రక్షణకు కీలక ముందడుగు -గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రకృతి మనకు చెందినది కాదు… మనమే ప్రకృతికి చెందినవాళ్లం. అందుకే ప్రకృతితో సామరస్యంగా జీవించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉన్నప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుంది. …

Read More »

అరుదైన వృక్ష జాతి మొక్కకు నామకరణం

-“క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” అని పేరు పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త వృక్ష జాతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు. …

Read More »

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనారిటీ యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమనే సంకల్పంతో ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని …

Read More »

జూలై 31తో గడువు ముగుస్తుంది… రైతులందరూ వెంటనే పంటల బీమా చేయించుకోండి: మంత్రి అచ్చెన్నాయుడు

– ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు పంటల బీమాయే భరోసా – చివరి రోజు వరకు వేచి చూడొద్దు… ఇప్పుడే నమోదు పూర్తి చేసుకోండి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా నమోదును జూలై 31వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనూహ్య పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతు కుటుంబానికి ఆర్థిక …

Read More »

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై తీవ్రవాయుగుండం కదులుతుందని, ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ – మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.వీటి ప్రభావంతో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షం పడే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు …

Read More »

ఆగస్టు 3 నుంచి 8 వరకు డీపీటీ టీకా కార్యక్రమం

-ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక టీకా శిబిరాలు -సార్వత్రిక టీకా కార్యక్రమానికి దూరంగా ఉన్న వారి కోసం -గొంతువాపు, కోరింత ద‌గ్గు, ధ‌నుర్వాతం వంటి ప్రాణాంత‌క వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గొంతువాపు( డిఫ్తీరియా ), కోరింత దగ్గు (పెర్టురిస్‌) , ధ‌నుర్వాతం (టెటానస్) వంటి ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాధుల నుంచి పిల్ల‌లు, కౌమార ద‌శ యువ‌త‌కు సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పించేందుకు ఆగస్టు 3 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టీకా(డీపీటీ, టీడీ) …

Read More »

రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. నెగిటివ్ స్టేట్‌మెంట్లతో రైతులను మరింత నష్టపెట్టొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

– పొగాకు రైతులకు కేజీకి రూ.20 సాయం.. 94 మిలియన్ కేజీల కొనుగోలుకు చర్యలు – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.188 కోట్లతో రైతులకు అండగా నిలుస్తున్నాం – రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వాగతిస్తాం.. జగన్‌ రైతులకు మంచి చేసే మాటలు మాట్లాడాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మిత్రపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. రాజకీయ నాయకుడిగా రైతుల శ్రేయస్సు కోరుకోవడం ప్రధాన లక్షణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు …

Read More »

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం

-పులుల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపాము -తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్నాము -నల్లమలలో పులి గర్జన శాశ్వతం చేయడమే లక్ష్యం -అడవుల పరిరక్షణలో భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ అంతర్జాతీయ పులుల దినోత్సవ శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పులి కేవలం మన జాతీయ జంతువు మాత్రమే కాదు, మన దేశ అటవీ సంపదకు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక. పులులను సంరక్షించడం అంటే మన అడవులను, జల వనరులను, వన్యప్రాణులను, భావితరాలకు అందించాల్సిన …

Read More »

భగవాన్ రామదూత స్వామిని దర్శించుకున్న ” తెలుగు శక్తి ” బి.వి.రామ్

-ప్రపంచంలో యుద్ధాలు నిలిచిపోయి శాంతి నెలకొనాలని ఆకాంక్ష -ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామివారు 43వ అవధూతగా, దత్తాత్రేయ పరంపరలో విశ్వశక్తి స్వరూపంగా గుర్తింపు పొందారు ఆయనను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం బిఎంఆర్ సార్థ కన్వెన్షన్స్, మన్నెగూడ, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర హైదరాబాద్ లో వేంచేసి ఉన్న రామ దూత స్వామి ని గురువారం మధ్యాహ్నం తెలుగు …

Read More »