Breaking News

Daily Archives: July 27, 2026

హంద్రీనీవాతో కుప్పానికి జలకళ

-కుప్పంలో పర్యాటకరంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకదృష్టి -స్థానికంగా పరిశ్రమల రాకతో వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు -మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి- ఆర్థిక శక్తిగా ఎదగాలి -కుప్పం నియెజకవర్గంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో ఉపాది, ఉద్యోగ అవకాశాలు …

Read More »

ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు

-ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగుల పనితీరు మారాలి -ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు… రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో …

Read More »

భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

-ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ఏఎస్ఆర్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం -2,703 ఎకరాల విస్తీర్ణం, రూ.4,727 కోట్ల ప్రాజెక్టు. 3,800 మీటర్ల రన్‌వే -తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం -500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ -ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో మైలురాయి ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన …

Read More »

పునాదిపాడులో బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

పునాదిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా కంకిపాడు మండలం పునాదిపాడులో పోలవరపు మాధవరావు, ఇతర కుటుంబ సభ్యుల విరాళం రూ.1.20 కోట్లు వెచ్చించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ …

Read More »

విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయి.. ఫలితాలపై దృష్టిపెట్టాలి

-విద్యార్థులకు మార్కులు రాకపోతే సీఎం నా మార్కులు తగ్గిస్తారు -కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్ -పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై ఆరా పునాదిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై మంత్రి …

Read More »

పిఠాపురం నియోజక వర్గం అభివృద్ధి పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ సమీక్ష

-క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాలయ సిబ్బంది -కొత్త రోడ్లు, నాగులాపల్లి తాగునీటి సరఫరా పథకం అభివృద్ధిపై ఆరా -అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించాలని స్పష్టీకరణ -పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు సూచనలు -నియోజకవర్గంలో 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు -పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై వివరణ కోరిన ఉప ముఖ్యమంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజా సేవల అమలు తీరుపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో 1,000 “మీ మార్ట్స్” ఏర్పాటుకు ఒప్పందం

న్యూఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఐఏఎస్ మరియు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) మేనేజింగ్ డైరెక్టర్  అనీస్ జోసెఫ్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 1,000 “మీ మార్ట్స్” ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ కార్యక్రమాన్ని తొలి దశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న …

Read More »

ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు స్టీమ్ రైస్ అందేలా ఏర్పాట్లు

-రాష్ట్రంలో అమలుకు సన్నహాలు -1000 మీ మార్డుల ఏర్పాటుకు కేంద్రం సహకారం -రేషన్ బియ్యం లో 10 శాతం నూకల బియ్యం ఉండేలా చర్యలు -ఢిల్లీ పర్యటనలో పౌర సరఫరాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి, ఉన్నతాధికారులను కలిసిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజలకు స్టీమ్ రైస్ అందించడం ద్వారా వారికి పౌర సరఫరాల శాఖ సేవలను మరింత చేరువ చేయొచ్చని, దీనిద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందడంతో …

Read More »

వైభవంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం

-ప్రధాని మోదీకి ధింసా, కూచిపూడి నృత్యాలతో ఘన స్వాగతం -ఉత్తరాంధ్రకు గర్వకారణంగా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం -ఏఎస్ఆర్ ఎయిర్ పోర్టుపై ప్రతీ ఇంటికీ చేరేలా విస్తృత ప్రచారం -ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్ట్ 1న ప్రారంభం అవుతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర …

Read More »

అత్యంత సంబరంగా ముగ్గుల పోటీలు

-పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు -విజేతలకు ఈ నెల 29 న ఫైనల్ పోటీలు -ఫైనల్ లో గెలుపొందిన వారికి ఆగస్టు 1న ఎయిర్పోర్ట్ వద్ద బహుమతులు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనే థీమ్ లో భాగంగా సోమవారం విశాఖపట్నం జిల్లా పరిధిలో రంగవల్లుల పోటీలు అత్యంత వైభవంగా, ఆడంబరంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ సచివాలయాలు/ప్రాంతాల్లో విశాఖ నగర పాలక పరిధిలోని అన్ని జోన్ల లో ఉత్సాహంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని …

Read More »