-కళా, రక్షణ రంగాలకు వారి కృషితో తెలుగు వారికి ఘన కీర్తి -చిరంజీవి సినిమాలకు నక్షత్రాలు కట్టా -హైదరాబాదులో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి, రక్షణ రంగంలో శాస్త్రవేత్త జి.సతీశ్రెడ్డి తెలుగు ప్రజలు గర్వించదగ్గ ప్రముఖులని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. చిరంజీవి తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోగా, సతీశ్రెడ్డి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన మేటి శాస్త్రవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. హైదరాబాద్ …
Read More »Daily Archives: July 26, 2026
సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు.
Read More »తెలుగు వైభవాన్ని చాటేలా ప్రతి ఏటా ‘తెలుగు మహోత్సవం’: సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తెలుగు మహోత్సవాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశం -ఉండవల్లి గుహల వద్ద ఘనంగా ముగిసిన రెండు రోజుల తెలుగు మహోత్సవ వేడుకలు.. ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా, సాంస్కృతిక వైభవాలు నలుదిశలా వెలుగొందేలా ఇకపై ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ‘తెలుగు మహోత్సవం’ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక …
Read More »ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ
– రైతులకు పంట రక్షణ, నేల తేమ సంరక్షణపై ప్రత్యేక దృష్టి – క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ప్రత్యామ్నాయ పంటలు, అత్యవసర విత్తన ప్రణాళికను మిషన్ విధానంలో అమలు చేయాలి – 24×7 రాష్ట్ర ఎల్నినో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి – రైతులకు నిరంతరం వాతావరణ, పంటలపై సూచనలు అందించాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల …
Read More »త్వరలో ఆప్కో ఎన్నికలు
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేత సహకార సంఘ ఎన్నికలు జరుపుతాం -అర్హులందరికీ నేతన్న సేవలో…ఆర్థిక సాయం -నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన -ప్రగడ కోటయ్య స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధి -చేనేతలకు ఎప్పుడూ సీఎం చంద్రబాబు పాలన స్వర్ణయుగమే -చేనేతలను మోసగించిన జగన్ -వైసీపీ కార్యకర్తలకు నేతన్న నేస్తం నిధులు : మంత్రి సవిత మండిపాటు -చీరాలలో ఘనంగా ప్రగడ కోటయ్య రాష్ట్ర జయంతి వేడుకలు -ప్రగడ కోటయ్య కుటుంబీకులకు ఘన సత్కారం చీరాల/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. రేపు(సోమవారం) ఉదయం/మధ్యాహ్నంలోపు పారాదీప్ – సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర …
Read More »పట్టణాల్లో వరద నియంత్రణకు సిటీ ఫ్లడ్ అలర్ట్
-ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన ఆర్టీజీఎస్ -వరదల నియంత్రణకు డిజిటల్ ఎలివేషన్ మోడల్ -రెండు రోజులు ముందుగానే వర్షాలపై ముందస్తు అంచనాలు -ఆరు గంటల ముందుగానే ఆకస్మిక వరద ముప్పును పసిగట్టే వ్యవస్థ -వరద ప్రభావిత ప్రాంతాల్లో హాట్ స్పాట్ల గుర్తింపు -ఆర్టీజీఎస్ సహకారంతో యంత్రాంగానికి ముందస్తు హెచ్చరికలు పంపనున్న ఏపీఎస్డీఎంఏ -మొదట విజయవాడలో అమలు.. త్వరలో మిగిలిన పట్టణాలు, నగరాలకు విస్తరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు… విజయవాడ నగరానికి నిత్యం పొంచిఉన్న వరదముప్పు ఇది. ఎప్పుడు ఆకస్మిక వరదలతో నగరంపై …
Read More »చేనేతకు పునర్వైభవం తీసుకురావాలి: ఎపి బిజెపి చీఫ్ పీవీఎన్ మాధవ్
-ప్రగడ కోటయ్య జయంతి నిర్వహణ స్వాగతం.. ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త చేనేత సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత రంగం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతి, స్వావలంబన, ఆర్థిక స్వాభిమానానికి ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేనేత అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఓబిసి మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీ నివాస్ అధ్యక్షత వహించారు …
Read More »“ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్య సాధన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్” లక్ష్యానికి అనుగుణంగా, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళలను సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్ సెంటర్ల స్థాపన ప్రతిపాదనపై పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ని ఈరోజు వారి కార్యాలయంలో Buy Desi ప్రతినిధులు మరియు MEPMA ఆంధ్రప్రదేశ్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి వివరించారు. ఈ సమావేశంలో MEPMA నెల్లూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు …
Read More »కృష్ణా డెల్టాకు సంజీవని పట్టిసీమ ప్రాజెక్టు
– పట్టిసీమ నిర్మాణ సమయంలో వైసీపీ నేతలు విమర్శించారు – చంద్రబాబు ముందు చూపుతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం – వర్షాభావ పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి అండగా నిలుస్తోంది – శివగంగ-బొబ్బిలి వాగు మరమ్మతు పనులకు శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపునకు, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి పట్టిసీమ ప్రత్యక్ష నిదర్శనమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని …
Read More »
Prajavartha Online Telugu News