-న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేవారు పూల బొకేలు తేవద్దని విజ్ఞప్తి చేసిన మంత్రి కందుల దుర్గేష్
-పేద విద్యార్థులకు ఉపయోగపడేలా బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు ఇతరత్రా సామాగ్రిని తేవాలంటూ సూచన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేవారు వందల రూపాయలు ఖర్చు చేసి కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దని దానికి బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, పెన్నులు, బాక్సులు తదితర సామాగ్రిని తీసుకురావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. పేదవారికి సాయం చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని మంత్రి అన్నారు..ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దుర్గేష్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..
Prajavartha Online Telugu News