-ఘనంగా ట్రాన్స్ ఫర్ మేషన్ చర్చి ప్రతిష్ట కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆ దేవ దేవుని ఆశీస్సుల వల్ల ప్రజలందరూ సంతోషంగా వున్నారు. బైబిల్ లో చెప్పిన విధంగా తోటి ప్రేమించి, సాయం చేస్తూండాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఆదివారం కంకిపాడు మండలంలోని దావులురు గ్రామంలో పాదర్ చాట్ల రాజశేఖర్ నిర్మించిన ట్రాన్స్ ఫర్ మేషన్ చర్చి ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై చర్చి ఫౌండేషన్ స్టోన్ ను ప్రారంభించారు. అనంతరం రెవ.డాక్టర్ డెవిడ్ బ్రెనహం దేవుని పాట ఆలపిస్తూ మందిరంలో ప్రవేశించటం జరిగింది.
ఈ సందర్బంగా మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పాదర్ చాట్ల రాజశేఖర్, రెవ.డాక్టర్ డెవిడ్ బ్రెనహం మంచి మిత్రులని, తన కోసం ఎంతో కష్టపడ్డారని వారి కృషిని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ఈ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవానికి హాజరుకావటం తన అదృష్టం భావిస్తున్నట్లు చెప్పారు. పుట్టిన ఊరును మర్చిపోకుండా ఆ గ్రామంలోనే సుందరమైన దైవ మందిరాన్ని నిర్మించిన పాదర్ చాట్ల రాజశేఖర్ ను, ఇందుకు సహకరించిన ఆయన సోదరులను, కుటుంబ సభ్యుల్ని అభినందించారు. పాదర్ చాట్ల రాజశేఖర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు వాళ్ల స్వగ్రామాలకు ఎంతో కొంత సేవ చేయాలని పిలుపు నిచ్చారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సేవగుణంగా అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో లంకా కరుణాకర్ దాసు, రెవరెండ్ ఆశీర్వాదం పాల్, కారు మంచి ప్రశాంత్, తాన్యా, చాట్ల విజయబాబు, తెలుగు దేశం రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, ఎంపి సెక్రటరీ నరసింహా చౌదరి, తెలుగుదేశం నాయకులు డాక్టర్ సంకే విశ్వనాథం, అబీద్ హుస్సెన్ , ఇత్తడి చార్లెస్ లతో పాటు గ్రామ ప్రజలు, దైవ సేవకులు పాల్గొన్నారు.