Breaking News

ఏపీలో విద్యాహక్కు చట్టం అమలు బాగుంది…

-ప్రశంసించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సోమవారం జరిగిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుతీరును జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రశంసించిందని ఏపీ విద్యాహక్కు చట్టం నోడల్ అధికారి డి.మధుసూదనరావు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున విద్యాహక్కు చట్టం నోడల్ అధికారి డి మధుసూదన రావు పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో విద్యాహక్కు చట్టం అమలు తీరు తెన్నులను, సెక్షన్ 32 ప్రకారం నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను, విద్యార్థులకు కల్పిస్తున్న రక్షణలను, సెక్షన్ 12 (1)సి ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో కల్పించిన ప్రవేశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ నుండి ఆర్టీఈ కన్సల్టెంట్ డా. కె. పెంచలయ్య, సహాయ సంచాలకులు పి.శ్రీనివాసరావు, శరత్ బాబు, సంధాని భాషా తదితరులు హాజరయ్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *