మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివిధ జిల్లాల కలెక్టర్లతో విభజన చట్టం ద్వారా రాష్ట్రంలో నెలకొల్పిన జాతీయ సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని సూచించగ గుడివాడ మునిసిపల్ కార్యాలయము నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెంటనే స్పందిస్తూ ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
Tags machilipatnam
Check Also
యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …