Breaking News

పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుచున్న ఏర్పాటు లను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి పరిశీలిస్తూ మాక్ డ్రిల్ రిహార్సల్ నిర్వహణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ వేడుకలకు మరియు జెండా పతాక ఆవిష్కరణకు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణరెడ్డి రానున్నారనన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే శకటాలు, వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పక్కాగా చేపట్టాలన్నారు. అలాగే పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు స్టేజ్ డెకరేషన్, పారిశుద్ధ్య నిర్వహణ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీటి వసతి సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఆర్ డి ఓ పెంచల్ కిషోర్, అడిషనల్ ఎస్ పి విమలాదేవి, తిరుపతి ఆర్డిఓ నిశాంత్ రెడ్డి, పిడి డి ఆర్ డి ఎ ప్రభావతి, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, సంబందిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *