Breaking News

అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే మా లక్ష్యం… : సీఎం చంద్రబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందామన్నారు. 2014-19 మధ్య కాలంలో టాప్‌-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచామన్నారు. 2014-19 మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందిందన్నారు. సంక్షోభం నుంచే అవకాశాలు వెతుక్కున్నామని.. అభివృద్ధికి బాటలు వేశామన్నారు. 2014-19 కాలంలో పోలవరం, రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించామన్నారు. టీడీపీ అధికారంలో కొనసాగుంటే పోలవరం ఫలితాలు ఇప్పటికే వచ్చేవని చంద్రబాబు అన్నారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. ప్రశ్నిస్తేనే దాడులు చేశారని చంద్రబాబు అన్నారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే విధ్వంసక పాలన చేపట్టారన్నారు. రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో దోపిడీ చేశారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించారన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల అప్పుల భారం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల తలసరి రుణం భారం పెరిగిందని.. తలసరి ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. మద్యం ఆదాయాన్ని.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారన్నారు. విధ్వంస పాలనపై ప్రజలు విసిగిపోయారని.. చైతన్యం వెల్లువెత్తితిందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేసి.. కూటమికి అద్భుత విజయం అందించారని చంద్రబాబు తెలిపారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. వాటన్నింటినీ తాము నెరవేరుస్తామన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఏపీ ప్రజలకు ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందని చంద్రబాబు అన్నారు. సుపరిపాలనకు తొలి రోజు నుంచే కూటమి ప్రభుత్వం నాంది పలికిందని తెలిపారు. 100 రోజుల కార్యాచరణ రూపొందించామని. వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో ప్రభుత్వం పయనిస్తోందన్నారు.
ఐదు సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. పాఠశాలలకు పార్టీ రంగులేసి.. విద్యా ప్రమాణాలకు గత ప్రభుత్వం తిలోదకాలిచ్చిందన్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశామని.. ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామన్నారు. మొదటి సభలోనే ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామన్నారు. సర్వే రాళ్లపై బొమ్మలకే రూ. 700 కోట్లు తగలేశారన్నారు. భూ సమస్యలను సృష్టించారన్నారు. మీ భూమి.. మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచామన్నారు. పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించామన్నారు. వలంటీర్లు లేకుంటే పెన్షన్లు సాధ్యం కాదని గత ప్రభుత్వం వృద్ధుల ప్రాణాలు తీసిందన్నారు. వలంటీర్లు లేకుండానే తొలి రోజునే 99 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేపట్టామన్నారు. అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించనున్నామన్నారు. రోజుకు 1.45 లక్షల మంది రూ. 5కే భోజనం చేసేవారని తెలిపారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసిందని.. మళ్లీ పేదల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలు ఇవ్వాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రపంచంలో తొలిసారిగా స్కిల్‌ సెన్సస్‌ చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *